ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా పంజా వ‌ల్ల ప‌వ‌న్ క్రేజ్‌.. కాస్త త‌గ్గింది. నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు మిగిలాయి. అయితే ఒక్క‌రికి మాత్రం కలిసొచ్చింది. అందులో విల‌న్ గా న‌టించిన అడ‌వి శేష్ పై చిత్ర‌ప‌రిశ్ర‌మ దృష్టి ప‌డింది. శేష్‌ని ఉప‌యోగించుకొంటే విల‌న్‌ల కొర‌త తీరిపోతుంది.. అని డిసైడ్ అయ్యారు. ఈ పాయింట్ ముందుగా క్యాచ్ చేసింది రాజ‌మౌళినే.

ప‌వ‌న్ విల‌న్ అడ‌వి శేష్‌.. బాహుబ‌లిలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా నిజంగా శేష్‌కి బంప‌ర్ ఆఫ‌రే!  రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్ అంటే మాములు విష‌యం కాదు. త‌ప్ప‌కుండా అత‌ని పాత్ర‌ని హీరో రేంజులో చిత్రీక‌రిస్తాడ‌నే పేరుంది. ఆ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువు అయ్యింది. ఇప్పుడు శేష్ పాత్ర‌నీ ఆ రేంజ్‌లో చూపిస్తే.. అత‌ని కెరీర్ ట‌ర్న్ అయిన‌ట్టే.

��

అయితే శేష్ హీరోగా నిల‌దొక్కుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. కిస్ అనే సినిమా త‌న డైరెక్ట‌న్‌లోనే తీశాడు. నిర్మాత కూడా త‌నే. బాహుబ‌లి బ‌య‌ట‌కు వ‌స్తే శేష్ ఇక హీరో వేషాల కోసం ఆలోచించ‌డేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: