గత రెండు రోజులుగా ఫిలింనగర్ లో కొన్ని ఆశక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక బడా సినిమాకు సంబందించిన ఆడియో వేడుకల స్వాగత బేనర్లలో ఆ సినిమా హీరో కుటుంబానికి చెందిన అందరి ఫోటోలు ఉండి అదే కుటుంబానికి చెందిన ఒక యువ హీరో ఫోటోలు ఆ బేనర్ పై లేక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇక వివరాలలోకి వెళితే మెగా పవరు స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘ఎవడు’ ఆడియో వేడుకలు ఈ నెల 30 తారీఖున అత్యంత ఘనంగా జరుగాపోతున్నాయి.

ఈ వేడుకకు సంబందించి కొన్ని మెగా అభిమాన సంఘాలు ‘ఎవడు’ సినిమా ఆడియో వేడుకను స్వాగతిస్తూ పెద్దపెద్ద బేనర్లు కట్టారు. ఆ బేనర్ల పై హీరో రామ్ చరణ్ ఫోటోతో పాటు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్ లతో పాటు త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఫోటోలను కూడా పెట్టాడు. కానీ ఈ మధ్యనే టాలీవుడ్ కు హీరోగా ‘గౌరవం’ సినిమా ద్వారా  పరిచయమైన అల్లు శిరీష్ ఫోటో పెట్టకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. తన మొదటి సినిమా ద్వారా మెగా అభిమానుల అంచనాలను శిరీష్ అందుకో లేకపోయినా ఇదే మెగా కాంపౌండ్ నుండి శిరీష్ వచ్చాడన్నది ఎవరూ కాదనలేని సత్యం.

బేనర్ల పై ఇంత మంది ఫోటోలు వేసిన మెగా అభిమానులు శిరీష్ ఫోటోను వెయ్యకపోవడం అనుకోకుండా జరిగింది అని అనుకోవాలా? లేక మెగా అబిమానులు శిరీష ను మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోగా ఇంకా గుర్తించ లేకపోతున్నారా? అనే మాటలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. మరి ఈ బేనర్లను చూసి శిరీష్ ఎలా ఫీలయ్యాడో మరి...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: