హీరో రామ్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కారణంగా మెగాహీరో కాస్త ఫీల్ అయ్యాడని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనిపై వినిపిస్తున్న టాక్స్ ని ఓసారి చూస్తే…ప్రస్తుతం రామ్ వరుస మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తను నటించిన చిత్రాలు వరుసగా హిట్స్ ని సాధిస్తుండటంతో ఇక నుండి రామ్ చిత్రాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది.


అలాగే తన అప్ కమింగ్ చిత్రాలలో స్టైల్ పరంగానే ఎంతో కేరింగ్ తీసుకోనున్నారు. హైపర్ చిత్రం తరువాత రామ్ నటించబోతున్న చిత్రంపై ఫ్యాన్స్ లోనూ ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే రామ్ కి సరిగ్గా సూట్ అయ్యే ఓ రెండు కథలకి తాజాగా గ్రీన్ సిగ్నల్ పడ్డాయని అంటున్నారు. అందులో ఒకటి అల్లుఅర్జున్ కి సూట్ అయ్యే ఓ కథ ఇప్పుడు రామ్ టేకప్ చేస్తున్నాడని అంటున్నారు.


ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ తాజాగా అల్లుఅర్జున్ కి ఓ కథని చెప్పారంట. కథ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా…ఎన్నో ట్విస్ట్ లతో ఈ కథ ఉందట. వింటున్నంత సేపు కథ చాలా కిక్ ని ఇచ్చిందని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు. అయితే ఈ కథని తను చేయలేనని మొదట సిట్టింగ్ లోనే ఆ డైరెక్టర్ కి అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం తన ఏజ్ సరిపోదని అన్నారు. తను ఆ యంగ్ స్టేజ్ ని దాటి వచ్చానని చెప్పటంతో ఆ డైరెక్టర్ హీరో రామ్ వద్దకి వెళ్ళి తిరిగి కథని మొత్తం చెప్పారు.


రామ్ కి ఆ కథ బాగా నచ్ఛటంతో వెంటనే యాక్సెప్ట్ చేశాడంట. అయితే రామ్ ఓకె చెప్పిన కొద్ది రోజులకి అల్లుఅర్జున్ ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి కథని చేద్దాం రండి అని అన్నారంట. అయితే రామ్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానడని ఆ డైరెక్టర్ చెప్పటంతో అల్లుఅర్జున్ కాస్త ఫీల్ అయ్యాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. మొత్తంగా రామ్ తీసుకున్న నిర్ణయం కారణంగా మెగాహీరో అల్లుఅర్జున్‌ ఓ మంచి కథని మిస్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: