కంటికి కనిపించేవి ఏవీ నిజాలు కాదు అంటారు పెద్దలు. ఈ మాట నటుడు, దర్శకుడు జీవీ కి బాగా వర్తిస్తుంది, పైకి విలన్ ల కనిపించే జీవీ చాలా మెత్తటి మనిషి. ఈయన నందమూరి బాలయ్యను కేరళా బ్రాహ్మణుడిగా, తెలుగు తెరపై త్వరలో చూపెట్ట బోతున్నాడనే వార్తలు ఫిలింనగర్ హడావిడి చేస్తున్నాయి. క్షత్రీయ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కొన్ని కారణాలు వల్ల కేరళా బ్రాహ్మణుల కుటుంబంలో పెరుగుతాడు.

ఇప్పటి వరకూ ఇటువంటి కధను బాలకృష్ణ చేయక పోవడంతో బాలయ్యకు ఈ కధ బాగా నచ్చి, తాను దగ్గర ఉండి ఈ కధకు సంబంధించిన ఫైలును సింహాచలం తీసుకు వెళ్ళి పూజ చేయించి పట్టుకు వచ్చారట. బోయపాటి శ్రీను సినిమా తరువాత ఈ సినిమావస్తుందని వార్తలు వస్తున్నాయి. అమెరికాలో లా డిగ్రీ పొందిన జీవీ ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీతో టై ఆఫ్ అయి అమితాబ్ ఎమ్ ఎల్ ఏ గా నటించే ఒక హిందీ సినిమా ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు బాలకృష్ణ అమితాబ్ ల సినిమాలను దర్శకత్వం వహించే ఛాన్స్ జీవీ లాంటి చిన్న విలన్ పాత్రలు వేసే నటుడికి వచ్చిందా అంటూ చాలా మంది ఆశ్చర్య పోతున్నారు.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం జీవీ బాలయ్యల సినిమా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది అని అమున్నారు. ప్రస్తుతం జీవీ తెలుగు సినిమాలతో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ లలో  కూడా ఓడజను పైగా సినిమాలు చేస్తున్నాడట..... 

మరింత సమాచారం తెలుసుకోండి: