రామ్ చరణ్శృతి హాసన్ జంటగా నటించిన ఎవడు మూవీ పాటలు జూన్ 30  విడుదల అవుతున్న విషయం తెలిసిందే.  ఆడియో ఫంక్షన్ నిర్వహించాలా వద్దా అని ముందు  సందేహంలో ఉన్న నిర్మాత దిల్ రాజు చివరకు ఫంక్షన్ చేస్తున్నట్లుగా డిక్లేర్ చేసారు. అయితే ఈ ఆడియోకి గెస్ట్ ఎవరు వస్తారనే సందేహం మాత్రం మెగా ఫాన్స్ లో క్లియర్ అవ్వలేదు. 


పవన్ కళ్యాణ్ వస్తాడని కొందరుచిరంజీవి వస్తాడని మరి కొందరు ఎలా పడితే అలా ఊహించేసుకుంటున్నారు. అయితే మాక్సిమం చిరంజీవి ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అందుకు కారణం  ఉత్తరాఖండ్ వరదలతో పాటుప్రజెంట్ పొలిటికల్ పరిస్తితులు. మరి చిరంజీవి రాక పొతే పవన్ వస్తాడా?గత కొద్ది కాలంగా చిరంజీవిని ఫేస్ చేయడానికి పవన్ ఇంటరెస్ట్ చూపడం లేదు.

చిరు గెస్ట్ గా వస్తాడేమో అని 
రాంబాబు మూవీ ఆడియో ఫంక్షన్ కూడా లేకుండా చేసాడు పవన్. మరి ప్రస్తుతం త్రివిక్రముతో చేస్తున్న మూవీ షూటింగ్ కూడా ఫారిన్లో పూర్తి చేసుకున్న పవన్ జూన్ 30న మార్నింగ్ హైదరాబాద్ గడ్డపై అడుగు పెడతాడని తెలుస్తుంది. ఎలాగూ చిరు రాడని సమాచారం అందుతుంది కాబట్టి ఈవెనింగ్ జరిగే ఈ ఎవడు ఆడియో ఫంక్షన్ కి పవన్ వస్తాడనే మెగా అభిమానులు ఊహిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: