అక్కినేని అఖిల్‌, శ్రీయ భూపాల్‌ల పెళ్ళి క్యాన్సిల్‌ వార్తలు వచ్చి ఇంచుమించు వారం రోజులు దాటిపోతున్నా నాగార్జున తన మౌనంతో వ్యవహరిస్తున్న తీరు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా నాగార్జున సన్నిహితులకు కూడ షాక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు మీడియా నుంచి తన సన్నిహితుల నుంచి వచ్చే ఫోన్  కాల్స్ తట్టుకోలేక నాగార్జున ఒక కొత్త సెల్ నెంబర్ ను తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వస్తున్న ఎంక్వైరీ కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతు ఉండటంతో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.  అంతేకాదు ప్రతిరోజు తన ఇంటి వద్ద ఎంతోమందిని కలిసే నాగార్జున ప్రస్తుతం ఎవర్ని కలవడానికి ఆసక్తి కనబరచడం లేదని వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుత సమాజంలో పెళ్ళిళ్ళు బ్రేకప్ లు సర్వసాదారనమైపోయిన పరిస్థుతులలో ఎదో తప్పు జరిగినట్లుగా నాగార్జున ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అంటూ అతడితో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ ప్రముఖులు కూడ కామెంట్ చేస్తున్నట్లు టాక్. అఖిల్ బ్రేకప్ తో పాటు తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఓం నమో వెంకటేశాయ’ ఫెయిల్యూర్ కూడ ఇంచుమించు ఒకే సమయంలో రావడంతో కొన్నాళ్ళపాటు నాగార్జున మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు అఖిల్ బ్రేకప్ వ్యవహారం పై తన సన్నిహితులతో కూడ మాట్లాడటానికి నాగార్జున ఆసక్తి కనబరచడం లేదు అని అంటున్నారు. దీనితో నాగ్ ప్రవర్తన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయా లేదంటే జరిగిన సంఘటనల పై ఒక నైరాశ్యం నాగార్జున చేత ఇలా వ్యవహరింప చేస్తోందా అన్న అనుమానాలు నాగార్జున సన్నిహితులే వ్యక్తం చేస్తున్నట్లు టాక్. 

అయితే వరసపెట్టి సినిమాలు చేస్తూ విజయాల పరంపరతో దూసుకుపోతున్న నాగార్జున కెరియర్ ఇప్పుడు మంచి పీక్ మీద ఉన్న నేపధ్యంలో కేవలం జరిగి పోయిన సంఘటనల గురించి బాధ పడుతూ రోజులు గడిపే మనస్థత్వం నాగార్జునది కాదని అందువల్ల ఈ మౌనం వెనుక ఎదో ఒక ఆలోచన ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: