మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. డాన్స్ లు ఫైటింగ్ లు మాస్ పంచ్ డైలాగులు పలకడంలో చిరంజీవి పోలికలు బాగా కనిపిస్తూ ఉండటంతో మాస్ ప్రేక్షకులకు అతి సులువుగా కనెక్ట్ అయిపోయాడు ఈ మెగా యుంగ్ హీరో.  

గతవారం విడుదల అయిన ‘విన్నర్’ కు యావరేజ్ టాక్ వచ్చినా ఈసినిమాను ప్రమోట్ చేసి నిలబెట్టడానికి ఈ మెగా మేనల్లుడు తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి అలాగే తన సినిమాల కథల ఎంపిక గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను నటిస్తున్న సినిమాలు అన్నీ కమర్షియల్ యాంగిల్ లో మసాలా సినిమాలులా ఉంటున్నాయి అన్న కామెంట్స్ పై స్పందిస్తూ తనకు కూడ వెరైటీ కథలలో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకోవాలని భావిస్తూ ఉన్నా ‘నా దగ్గరకు కొత్త కథతో రండి’ అని డిమాండ్ చేసే స్థాయి తనకు లేదు అని అంటూ సంచలన కామెంట్స్ తన పై తానే చేసుకున్నాడు.

ఇదే సందర్భంలో తన తల్లి పై తనకు ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ స్టార్ హోటల్స్ లో వేలరూపాయల ఖర్చుతో తినే గ్రీల్ద్ చికెన్ ఫిష్ లాంటి రకరకాల కూరలు తిన్నా తనకు తన అమ్మ ప్రేమతో చేసి పెట్టే టమాటో పప్పు అప్పడాలు ఆవకాయ తిన్నప్పుడు వచ్చినంత ఆనందం తనకు మరే స్టార్ హోటల్ భోజనంలో రాలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఇదే సందర్భంలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు సాయి ధరమ్ తేజ్.

చిన్నప్పుడు తల్లిమాట విని కాలేజీలో లెక్చరర్స్ మాట విని తన జీవితం అంతా రొటీన్ గా మారిపోయిందని ఇప్పుడిప్పుడే తాను సంపాదన మొదలు పెట్టాను కాబట్టి వెంటనే పెళ్లి చేసుకుని భార్య మాటలు వింటూ టార్చర్ పడేకన్నా మరో 4 ఏళ్ళపాటు ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ తహన పెళ్ళి పై తానే సెటైర్ వేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అంతేకాదు తన తల్లికి తన తమ్ముడుకు తాను తీర్చవలసిన కోర్కెలు చాల పెద్ద లిస్టు ఉందని చెపుతూ ప్రస్తుతం తన ధ్యాస అంతా సినిమాలు చేయడం డబ్బు సంపాధించడం పైనే ఉంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో..  



మరింత సమాచారం తెలుసుకోండి: