ఆగడు స్ర్కిప్టు పనులు పూర్తయ్యాయి. అయితే కథానాయిక ఎవరు?? అనే విషయంపై చిత్ర బృందం మల్లగుల్లాలు పడుతోంది. మహేష్ పక్కన దీపికా పదుకొణె అయితే బాగుంటుందని శ్రీను వైట్ల భావిస్తున్నాడట. దీపికా కూడా దక్షిణాది సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది. మహేష్లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే ఎవరు మాత్రం కాదంటారు??
��
ఒక వేళ దీపికా కాల్షీట్లు దొరక్కపోతే ఆప్షన్ ఏమిటా?? అని కూడా శ్రీనువైట్ల ఆలోచిస్తున్నారు. సెప్టెంబరు నుంచి ఆగడు షూటింగ్ మొదలైపోతుంది. ఒకవేళ దీపిక కాల్షీట్లు సర్దుబాటు చేయకపోతే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే ఎందుకైనా మంచిదని మరో ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది చిత్రబృందం.