తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలు ఉన్న ఎన్టీఆర్ అచిరకాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి మనోడికి గోల్డెన్ టైమ్ నడుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. టెంపర్ తో మంచి హిట్ కొట్టిన ఎన్టీఆర్ గత సంవత్సరం రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ఓ బైక్ వాడాడు..ప్రస్తుతం ఆ బైక్ పోయింది.
ఆ....... పోయిందీ అంటే నిజంగా ఎవరో దొంగతనం చేశారని కాదండీ బాబూ..జనతా గ్యారేజ్ మంచి విజయం సాధంచిన తర్వాత ఆ చిత్రంలో లో ఎన్టీఆర్ వాడిన బైక్ అభిమానులను ఎవరినైనా ఎంపిక చేసి ఇస్తామని చెప్పారు. దీంతో బైక్ ని మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో ఎంపిక చేసిన అభిమానికి రాయల్ ఎన్ ఫీల్డ్ ని అందించారు . అవునూ ఇంతకీ ఎన్టీఆర్ వాడిన ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ ని దక్కించుకున్న లక్కీ ఫెలో ఎరవా అనుకుంటున్నారా..! నల్లగొండ జిల్లా కు చెందిన రాజ్ కుమార్ రెడ్డి . ఈ బైక్ ని మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో అందజేసారు .
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు దర్శకులు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని నందమూరి ఫ్యామిలీ అంటే చాలా అభిమానమని అన్నారు. ఇక బైక్ ని గెలుచుకున్న అభిమాని సంతోషానికి అంతేలేకుండా పోయింది . ప్రస్తుతం ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో జై లవకుశ చిత్రం చేస్తుండగా కొరటాల శివ మాత్రం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.