ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ రేపు జరగబోతున్న ఎవడు ఆడియో ఫంక్షన్. ఈ వేడుక మీదే అందరి దృష్టి ఉంది. సామాన్యంగా మెగా కుటుంబ బలప్రదర్శన గా తమ అభిమానులకు కనిపించే ఈ వేడుకలో రేపు అతిధులుగా ఎవరు వస్తారు..? అనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మీడియా కూడా రేపు జరగబోయే ఎవడు ఆడియో వేడుక గురించి చాలా ఆశక్తికరంగా ఎదురుచూస్తోంది. అయితే రేపు జరగబోయే ఆడియో వేడుకకు చిరంజీవి రావడం చాలా కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ వరదల పుణ్యమా అని ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొన్న  చిరంజీవి రేపు ఘనంగా జరగబోయే ఆడియో వేడుకలలో పాల్గొంటే ఇంకా రచ్చ జరుగుతుందని, దానివల్ల చిరంజీవి కి మరింత నెగటివ్ ఇమేజ్ వస్తుందని భయపడుతున్నాడట.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈ రోజు యూరప్ నుండి పవన్ తిరిగిరావడం జరిగినా ఎంతవరకు పవన్ ఈ ఆడియో వేడుకలో తాను పాల్గొంటాడు అనే విషయం పై కూడా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ విషయంలో కూడా మరో వార్త వినిపిస్తోంది. బన్నీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో బిజీ గా ఉండడంతో ఈ వేడుకకు బన్నీ రావడం జరుగుతుందా...? అనే వార్తలు కూడా హాల్ చల్ చేస్తున్నాయి. ఇలా మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రకరకాల కారణాలతో ఈ వేడుక నుండి దూరం అయితే చెర్రీ ఎవడు ఆడియో బోసిపోతుంది కదా అంటూ మెగా అభిమానులు తెగ బాధపడుతున్నారట.

కాని నిర్మాత దిల్ రాజు మటుకు ఈ వేడుకకు ఎవరు అతిధులుగా వస్తున్నారు అన్న విషయం అధికారికంగా ఇప్పటికీ తెలపకపోవడంతో అటు మెగా అభిమనులలోను ఇటు మీడియా లోనూ రేపు జరగబోతున్న ఆడియో వేడుకపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చివరికి ఈ వేడుకకు మెగా కుటుంబం అంతా వస్తుందా..? లేక ఎవరూ రారా..? అనే విషయం రేపు తేలిపోతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: