టాలీవుడ్డులో ప్రజెంట్ ట్రెండుకి దిగ్గజ దర్శకులు ఎవరయ్యా అంటే దాసరి, రాఘవేంద్ర రావు కాస్తో కూస్తో రామ్ గోపాల్ వర్మ అనే చెప్పుకోవాలి. అలాంటి దిగ్గజ దర్శకుల పరువును పబ్లిగ్గా తీసేసింది లేడీ డైరెక్టర్ బి జయ. ఎలా అనుకుంటున్నారా? అయితే తాజాగా జరిగిన 'రొమాన్స్' ఆడియో వేడుకలో ఆమె ఇచ్చిన స్పీచులోకి వెళ్ళాల్సిందే!


టాలీవుడ్ ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు, కె రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ వంటి ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంటులకు వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు? కానీ మారుతి తను ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు తన చూట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి దర్శకుడు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేదు. ఇకపై రాడు కూడా, అంటూ జయ ఇచ్చిన స్పీచ్ ఎప్పుడు పెద్ద కాంట్రవర్సీ కాబోతుంది.


ఏదో ఆడియోలో ఉన్న ఓ సాంగుని రిలీజ్ చేయమని పిలిస్తే, మారుతి అంతటివాడు ఇండస్ట్రీ లోనే లేడు అంటూ ఆమె ఇచ్చిన స్పీచ్ కొందరికైతే నవ్వు కూడా తెప్పిస్తుంది. తనకి చేత కాదు అని చెబుతూనే ఇతర దర్శకులను ఇన్వాల్వ్ చేయడం చూస్తుంటే నిజంగా ఇది డబ్బా కొట్టుడే అని ఈజీగా తెలుస్తుంది. అయినా దాసరి, కెఆర్ఆర్, వర్మలు ఎందరో టాలెంట్ ఉన్న దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. పూరి, హరీష్ మొదలైన వాళ్ళంతా వర్మ స్కూల్ నుండి వచ్చిన వారే. ఆ విషయం జయకి తెలియదా లేక కావాలనే ఆమె పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడి ఉంటుందా! అసలు ఆమె స్టేజ్ ఎక్కేప్పుడు మామూలుగానే ఉందా! లేక మత్తులో ఉందా! ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి జయ స్పీచ్ విన్న తరువాత.

మరింత సమాచారం తెలుసుకోండి: