ఎన్నో ప్ర‌త్యేక‌త‌లతో ముస్తాబ‌వున్న బాహుబ‌లికి ముందే దిష్టి త‌గిలేసింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌క ముందే ఓ అప‌శ‌కునం ఎదురైంది. బాహుబ‌లి ప్ర‌తినాయ‌కుడు రానా - గుర్ర‌పు స్వారీ నేర్చుకొంటూ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. గాయాలు చిన్న‌వేగానీ - శ‌కునం మాత్రం బాలేద‌ని చిత్ర‌బృందం కంగారు ప‌డుతోంది. మ‌రో వారం రోజుల్లో షూటింగ్ పెట్టుకొని ఇలా జ‌రిగిందేమిటి??  అని వ‌ర్రీ అవుతోంది జ‌క్క‌న్న టీమ్‌!

ఇది వ‌ర‌కూ ఏ సినిమాకీ రాని ముంద‌స్తు ప్ర‌చారం బాహుబ‌లికి వ‌చ్చేసింది. రోజుకో వార్త‌. ర‌క‌ర‌కాల ఊహానాగాలు. వీట‌న్నింటికీ త‌ట్టుకోవ‌డానికి జక్క‌న టీమ్ శ‌క్తివంచ‌న లేకుండా కృష్టి చేస్తోంది. వంద‌కోట్ల సినిమాక‌దా?  అందుకే న‌టీన‌టుల‌కు  ముంద‌స్తు శిక్ష‌ణ ఇప్పించారు. అందులో భాగంగానే రానా గుర్ర‌పు స్వారీ నేర్చుకొనే ప్ర‌య‌త్నంలో కింద ప‌డ్డాడు. ట్రైల‌రే ఇలా ఉంటే, ఇక షూటింగ్‌లో ఇంకెన్ని దెబ్బ‌లు తినాల్సివ‌స్తుందో...

��

మ‌గ‌ధీర సినిమా అంతా అయిపోయిన త‌ర‌వాత కీర‌వాణి ఓ దిష్టి పాట తీశారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాల‌ని. ఈ సినిమాకి ముందే అలాంటి పాట ఒక‌టి స్వ‌ర‌ప‌ర‌చాలేమో??

మరింత సమాచారం తెలుసుకోండి: