మారుతి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం రొమాన్స్. ఈ సినిమా పాటల వేడుక కాస్త.. మారుతి పొగడ్తల వేడుకగా మారిపోయింది. మైకు పుచ్చుకొన్నవాల్లంతా మారుతిని పొగిడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వీకరించారు. దర్శకురాలు బి.జయ అయితే - దాసరి, రాఘవేంద్రరావు కంటే మారుతినే గొప్పోడు అంటూ కితాబిచ్చేసింది.
��
పరిశ్రమలో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మలాంటి గొప్ప దర్శకులున్నారు. కానీ వాళ్ల దగ్గర సహాయకులుగా పనిచేసిన వారికి వాళ్లేం చేయలేదు. కానీ మారుతి మాత్రం అందరినీ పైకి తీసుకొస్తున్నాడు అంటూ కీర్తించింది ఆ దర్శకురాలు. దాంతో మారుతి కూడా కంగారు పడిపోయాడు. ''నాకు అంత లేదు మేడమ్..'' అంటూ ఆమె నుంచి మైకు అందుకొన్నాడు.