తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో రాజేంద్ర ప్రసాద్.  గత కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజేంద్రుడు తండ్రి, మామల పాత్రలు వేస్తూ బిజీగా మారారు.  గత రెండు సంవత్సరాల క్రితం ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఆ ఎన్నికలు టాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదిపేసింది..సార్వత్రిక ఎన్నికలను తలదన్నెలా రెండు వర్గాలు ఏర్పడ్డాయి.  ఇక రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ జయసుధ ల మద్య జరిగిన యుద్దంలో రాజేంద్ర ప్రసాద్ కి అధ్యపదవి లభించింది.  తర్వాత అన్నీ సర్ధుకున్నాయి..తమ మద్య ఎలాంటి పోటీ లేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఉమ్మడి కుటుంబం అంటూ ఆ ఎపిసోడ్ కి పులిస్టాప్ పెట్టారు.  
Image result for maa movie association
ఇక మా మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజేంద్రుడు మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నాడని వార్తలు వచ్చాయి..కానీ ఇంతలోనే రాజేంద్రప్రసాద్ ఆశలకు.. శివాజీరాజా గండి కొట్టాడు.  రెండేళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా పని చేసిన రాజేంద్రుడు కి ఆ పదవి రాకపోవడంతో..అవమానంగా ఫీల్ కావడం..అప్పటి నుంచి ఆయన బయట కనిపించకుండా పోయారు.  మా ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ బయట కనిపించడమే మానేశారాయన.
Image result for maa movie association
ఇంతలా కుంగిపోవడం ఎందుకూ.. అని ఆయన సన్నిహితులు ఊరడించే ప్రయత్నం చేసినా.. రాజేంద్ర ప్రసాద్ మాత్రం నిరాశ, నిస్పృహల నుంచి బయటపడలేకపోతున్నారట.  ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ..అసలు రాజకీయాలంటేనే ఇలా ఉంటాయని రాజేంద్రుడు గ్రహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  ఈ వయసులో అనవసర టెన్షన్లు అవసరం లేదని కూడా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: