నిన్న సాయంత్రం జరిగిన ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు కీరవాణి రాజమౌళి కంటనీరు పెట్టేలా చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. దీనితో కొందరైతే అన్నయ్య తమ్ముడును ఏడ్పించాడు అన్న కామెంట్స్ కూడ చేసుకున్నారు.

ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే నిన్న జరిగిన ‘బాహుబలి 2’ ఫంక్షన్ లో కీరవాణి వేదిక ఎక్కి రాజమౌళిని పొగుడ్తూ ఉంటే రాజమౌళి తీవ్రమైన భావోద్వేగానికి గురి కాబడ్డాడు. దీనికి కారణం కీరవాణి ‘బాహుబలి’ లోని ‘ఎవ్వడంటే ఎవ్వడని’ పాట లిరిక్ సాహిత్యం మార్చి రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ పాటగా పాడాడు. 

అయితే ఈ అనుకోని సంఘటనకు కొద్ది సేపు రాజమౌళి షాక్ లో ఉన్నాడు. దేశంలోనే కాదు ప్రపంచంలోని గొప్ప దర్శకులలో రాజమౌళి ఒకడని కీరవాణి పొగుడ్తూ పాటగా పాడుతూ ఉంటే ఎలాంటి భావోద్వేగానికి లోను కాకుండా రాజమౌళి చాలసేపు వేదిక పై కనిపించినా చిట్టచివరకు మాత్రం జక్కన్న కీరవాణి పొగడ్తలకు కరిగిపోయాడు. 

ఇంకా ఎదుగుతూనే ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని పాట రూపంగా కీరవాణి దీవిస్తున్నప్పుడు రాజమౌళి భావోద్వేగంతో కంట కన్నీరు పెట్టడం స్పష్టంగా కనిపించింది. అయితే కీరవాణి రాజమౌళి పై చేసిన మితిమీరిన పొగడ్తలు మాత్రం ఈ ఈవెంట్ కు అవి అంత అవసరమా అని అనిపించేలా ఉన్నాయి. ఏమైనా కీరవాణి రాజమౌళి పై స్వర పరిచిన పాట ‘బాహుబలి 2’ ఈవెంట్ కు హాట్ టాపిక్ గా మారింది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: