తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు బండ్ల గణేష్.  తర్వాత ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు..అయితే అకస్మాత్తుగా ప్రొడ్యూసర్ అవతారమెత్తిన బండ్లపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.  ఈయన పలానా వాళ్లకు బినామీ అని..ఇండస్ట్రీలో పెద్దలు వెనుక ఉండి బండ్ల తో వ్యాపారం చేయిస్తున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి.  
Image result
అయితే ఇవన్ని తనపై కొంత మంది పుట్టిస్తున్న రూమర్లని తాను కష్టపడి పైకి వచ్చానని అంటున్నారు.  తాజాగా బండ్ల గణేష్ ని బండబూతులు తిట్టారు..ప్రముఖ నిర్మాత, హీరో సచిన్ జోష్.  గతంలో బండ్ల గణేష్ - సచిన్ జోషి కలిసి '' నీ జతగా నేనుండాలి '' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికీ 2’ చిత్రాన్ని తెలుగు లో '' నీ జతగా నేనుండాలి '' రిమేక్ చేశారు.   
Image result for nee jathaga nenundali song
కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది.  దీంతో వీరిద్దరి మద్య అభిప్రాయభేదాలు రావడం..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జరుగుతూ వచ్చింది.  ఇక బండ్ల గణేష్ పై 14 రకాల కేసులను పెట్టాడట సచిన్ జోషి . బండ్ల గణేష్ ని ఎలాగైనా సరే జైలుకు పంపాలని అనుకున్నాడట అయితే బండ్ల గణేష్ తండ్రి వచ్చి సచిన్ ని బ్రతిమిలాడటం తో వదిలేసానని అంటున్నాడు.
Related image
మరోవైపు బండ్ల గణేష్ మాత్రం సచిన్ ని పెట్టుకొని చేసిన సినిమాతో నేను నష్టపోయాను ఆ సినిమాకు లాభాలు రావడం ఏంటి ? బిజినెస్ జరగడం ఏంటి ? అని అంటున్నాడు . కానీ సచిన్ మాత్రం డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని నన్ను మోసం చేసాడని ఆరోపిస్తున్నాడు .  గత కొంత కాలంగా నిశ్శబ్ధంగా ఉన్న ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: