‘కాటమరాయుడు’ హడావిడి చల్లారిపోవడంతో పవన్ ఏప్రియల్ మొదటి వారంలో ప్రారంభం కానున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రాజెక్ట్ పై తన మనసు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న పవన్ ఈసినిమా షెడ్యూల్స్ గురించి త్రివిక్రమ్ తో చాల లోతుగా చర్చించినట్లు టాక్. 

ఈసినిమాను 80 రోజులలో పూర్తి చేస్తానని దానికి పవన్ సంపూర్ణ సహకారం కావాలి అంటూ త్రివిక్రమ్ పవన్ ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి పవన్ ఓకె చెప్పినా ఎందుకైనా మంచిదని త్రివిక్రమ్ మరో 20 రోజులు అదనంగా ఈసినిమాకు సంబంధించి షెడ్యూల్స్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక చేపట్టిన త్రివిక్రమ్ పవన్ అనుమతితో ఈసినిమాకు సంబంధించి విలన్ పాత్రకు ఒక ఊహించని నటుడుని ఎంపిక చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీలో విలన్ పాత్రకు ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్. 

‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా నటించిన ఆది పినిశెట్టి బాడీ లాంగ్వేజ్ తో పాటు అతని నటన కూడ త్రివిక్రమ్ కు బాగా నచ్చడంతో ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ న్యూస్ అధికారికం అయితే ఆది పినిశెట్టి కెరియర్ ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుంది అని అంటున్నారు. 

ఈసినిమాలో విలన్ క్యారెక్టర్ చాల పవర్ ఫుల్ గా ఉండబోతున్న నేపధ్యంలో ఆది పినిశెట్టి ఈ పాత్రకు అన్ని విధాల సరిపోతాడు అన్న ఉద్దేశ్యంతో ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసినిమాను దసరాకు విడుదల చేయాలి అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్ ఆలోచనలు నిజం అయితే ‘కాటమరాయుడు’ సినిమా తరువాత కేవలం 6 నెలలలో మరో పవన్ సినిమా అంటే ఇది కూడ ఒక అరుదైన రికార్డు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: