తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇండస్ట్రీలోకి కథా, మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకుడిగా మారారు. అతడు, జులాయి, జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా వ్యవహరించి తెలుగు సినిమా రంగంలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్, కమెడీ హీరో సునీల్ ఈయనకు మంచి ఆప్తమిత్రులు. ఇప్పటికే పవన్ కళ్యాన్ తో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు తీసి సెన్సేషనల్ విజయాలు అందుకున్నాడు.
ఇక కాటమరాయుడు చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ తో సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..అంతే కాదు ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైపోతున్నారట త్రివిక్రమ్. ఇక ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారట. ఇక పవన్ కళ్యాన్ కి జోడీగా మళియాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయెల్ ని హీరోయిన్లుగా సెలెక్ట్ చేసుకున్నారట.
మరో ముఖ్య పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బుని కూడా ఈ చిత్రంలో తీసుకున్నారట..అయితే ఇప్పుడు పవన్ కళ్యాన్ పక్కన కమెడియన్ అనగానే వెంటనే ఆలీ గుర్తుకు వస్తారు..కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్..పవన్ పక్కన కమెడియన్ గా నటించేందుకు తమిళ నటుడు రోబో శంకర్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మారి, సింగం 3 వంటి చిత్రాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రోబో శంకర్ ఇప్పుడు తెలుగు లో కూడా రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడట..మరి తెలుగు లో కమెడియన్ గా మనోడు ఎంతవరకు అలరిస్తాడో వేచి చూడాలి. అయితే సినిమా నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.