పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ మూవీ వీరం రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్ ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి. అయితే కథ కథనాలు రొటీన్ గా ఉండటం వల్ల కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర కష్టాలు పడుతున్నాడు. ఈ సినిమా ఫలితం వల్ల తను చేయబోయే మరో సినిమాను చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడట పవన్ కళ్యాణ్.


కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే త్రివిక్రం తో పాటుగా నీశన్ డైరక్షన్ లో సినిమాకు ముహుర్తం పెట్టాడు పవర్ స్టార్. అది కూడా వేదలం రీమేక్ వస్తున్న సినిమా కావడం విశేషం. త్రివిక్రం సినిమా ఏప్రిల్ 6నుండి సెట్స్ మీదకు వెళ్తుండగా ఆ సినిమా పక్కా హిట్ అన్నట్టే లెక్కేసుకోవచ్చు. ఇక మరో ప్రాజెక్ట్ అదేనండి నీశన్ డైరక్షన్ లో మూవీ చేయాలా వద్దా అనే సంక్షోభంలో పడ్డాడట.


కాటమరాయుడు పవన్ ఇమేజ్ కు తగ్గ కథ కాదని.. రొటీన్ కథే అంటూ రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం పవన్ తన ఇమేజ్ సినిమా సినిమాకు పెంచుకుని వాటి ఫలితాలతో మళ్లీ టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా నిలవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో చేసే ప్రతి సినిమా హిట్ టార్గెట్ తో రావాల్సిందే. 


త్రివిక్రం తో సినిమాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ నీశన్ డైరక్షన్ లో మూవీ క్యాన్సిల్ చేసి వినాయక్ తో సినిమా చేయాలని ఫిక్స్ అవుతున్నాడట. అన్ని కుదిరితే ఆ సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని టాక్. మొత్తానికి కాటమరాయుడు ఎఫెక్ట్ తో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: