మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ వరుణ్‌ తేజ్. వరుణ్‌ తేజ్ ఈ సంవత్సరం రెండు సినిమాల్ని ప్లాన్ చేయటంతో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఈ మెగాహీరో హడావిడి కాస్త ఎక్కవుగా కనిపిస్తుంది. ఇక మిస్టర్ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే... శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ‘మిస్టర్’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


మొదటి నుండి ఈ మూవీపై చిత్ర యూనిట్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే బయటకు వచ్చిన మిస్టర్ మూవీ టీజర్,ట్రైలర్, బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ రోజు ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్న మిస్టర్ మూవీపై మార్కెట్ వర్గాల్లోనూ క్రేజ్ క్రియేట్ అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుండి. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ఈ మూవీ ఒకరోజు ముందుకు అంటే ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది.


వరుణ్ తేజ్ గతేడాది ఒక్క సినిమా చేయకపోవడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. అయితే మిస్టర్ మూవీలో వరుణ్‌ తేజ్ మిస్టేక్‌ ఏంటంటే....బయటకు వచ్చిన మిస్టర్ మూవీ ట్రైలర్ కి మార్కెట్ లో డివైడ్‌ టాక్ వచ్చింది.


ఈ ట్రైలర్ ని మార్చాలని కొందరు చిత్ర యూనిట్ కి చెప్పగా... వరుణ్‌ తేజ్ మాత్రం మొదటగా వచ్చినా ట్రైలర్ బాగుందని, మార్చవద్దని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా వరుణ్‌ తేజ్ చెప్పకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఈ ప్రేమ కథా చిత్రం మీద మంచి నమ్మకంతో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: