తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలుగా వచ్చిన వారు కొద్దిమందే టాప్ పొజీషన్లోకి వచ్చారు. ఇక ఇండస్ట్రీలో రెబల్ స్టార్ వెలిగిపోయిన కృష్ణం రాజు నటవారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ సినిమా ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా మార్చింది. తర్వాత డార్లింగ్, మిర్చి లాంటి సినిమాలతో మనోడు టాప్ హీరోగా ఎదిగాడు.
ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో ఏకంగా జాతీయస్థాయి నటుడిగా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మానియా పట్టుకుంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కి సారీ చెబుతున్నాడు. అదేంటీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎందుకు క్షమాపణలు చెప్పాడా అని అనుకుంటున్నారా..! హుబలి కోసం ఐదేళ్లు సమయం కేటాయించడమే కారణం .
మిర్చి సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాలకు బాహుబలి రిలీజ్ అయ్యింది , ఇక బాహుబలి 2 రిలీజ్ కావడానికి రెండేళ్ల సమయం పడుతోంది అంటే రెండు సినిమాల కోసం ఐదేళ్ల పాటు ఎదురు చూసారు అభిమానులు . ఇలా ఐదేళ్ల పాటు పడిగాపులు అంటే ఫ్యాన్స్ కు నరకమే మరి అందుకే తన అభిమానులకు సారీ చెప్పడమే కాకుండా ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు.
ఇక బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకకాలంలో రాధాకృష్ణ దర్శకత్వంలో అలాగే సుజిత్ దర్శకత్వంలో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతే కాదు ముందు ముందు సంవత్సరానికి రెండు సినిమాల లెక్కన తీస్తానని ఫ్యాన్స్ ని హ్యాపీగా ఉంచుతానని అంటున్నాడు బాహుబలి ప్రభాస్.