సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఈమధ్య ఫుల్ ఫాంలో ఉన్న దిల్ రాజు శతమానం భవతి హిట్ తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలెంట్ ఎక్కడుంటే అక్కడ దిల్ రాజు కర్చీఫ్ వేస్తాడు. ఇప్పుడు అదే తరహాలో ఓ అప్ కమింగ్ రైటర్ కు డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడట దిల్ రాజు. ఇంతకీ దిల్ రాజు ఆఫర్ అందుకున్న ఆ రైటర్ ఎవరు అంటే ప్రసన్న కుమార్ అని తెలుస్తుంది.


నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్ రెండు సూపర్ హిట్ సినిమాలే. రీసెంట్ గా వచ్చిన నేను లోకల్ నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాలకు మాటలను అందించాడు బెజవాడ ప్రసన్న కుమార్. ముఖ్యంగా నేను లోకల్ నాని సంభాషణలు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేశాయి.


సినిమా సక్సెస్ లో ముఖ్య పాత్ర పోశించిన డైలాగ్స్ ప్రసన్న కుమార్ ప్రతిభే అని తెలుసుకున్న దిల్ రాజు అతనికి డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడట. నేను లోకల్ టైంలోనే అతన్ని కథ సిద్ధం చేసుకోమని చెప్పాడట. దిల్ రాజు అడిగిన కథ సిద్ధం చేయడంతో ఇక సినిమా ఆఫర్ ఇచ్చేశాడట. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.


రెండు సినిమాలకు రైటర్ గా పనిచేసిన ప్రసన్న కుమార్ దిల్ రాజు ప్రొడక్షన్ లో దర్శకుడిగా మారడం అంటే లక్కీ ఆఫర్ అని చెప్పాలి. ప్రతిభ ఉంటే ఎలాంటి వారికైనా ఛాన్సులు దక్కుతాయని మరోసారి ప్రసన్న ద్వారా తెలిసింది. ఇక టాలెంట్ పీపుల్స్ కు తనవంతు సహకారం అందిస్తూ వారి కెరియర్ కు ఉపయోగపడుతూ నిర్మాతగా తను హ్యాపీగా ఉంటున్నాడు దిల్ రాజు. 



మరింత సమాచారం తెలుసుకోండి: