మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. ఏడాదిన్నర తర్వాత రవితేజ చేస్తున్న సినిమా ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు ఏర్పరచుకుంది. స్క్రీన్ ప్లే రైటర్ గా ఉన్న విక్రం సిరి మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ అందరిని ఇంప్రెస్ చేసింది.


ఇక సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే రాశి ఖన్నాను సెలెక్ట్ చేశారు. ప్రస్తుత కుర్ర హీరోయిన్స్ లో సూపర్ ఫాంలో ఉన్న రాశి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. రామ్, సాయి ధరం తేజ్ లతో పాటుగా రవితేజతో కూడా మూవీ చేస్తుంది. ఇక ఈ సినిమాలో స్టోరీ పరంగా మరో హీరోయిన్ అవసరమై ఉందట.  


రెండో హీరోయిన్స్ కోసం సెర్చింగ్ లో ఉన్న చిత్రయూనిట్ కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రగ్యా ముందు ఈ ఆఫర్ ఉంచగా రవితేజ కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటుంది అనుకుంటాం కాని ఇక్కడ అమ్మడు షాక్ ఇచ్చిందట. ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాల వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయడం కాస్త కష్టమే అంటుందట.  


ఇంకా టచ్ చేసి చూడు యూనిట్ కు మాత్రం ఫైనల్ నిర్ణయం చెప్పలేదట. బోయపాటి శ్రీను సినిమాతో పాటుగా మంచు విష్ణు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా రవితేజ ఆఫర్ మిస్ అయితే మాత్రం ఓ లక్కీ ఛాన్స్ మిస్ అయినట్టే. మరి అమ్మడు ఈ అవకాశాన్ని అందుకుంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: