తెలుగు ఇండస్ట్రీలో మహానటుడిగా నటసార్వభౌమగా వెలిగిపోయిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తనయుడు నందమూరి హరికృష్ణ నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.  చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేశాడు.  2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు.  

ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రావడంతో టాప్ హీరోగా ఎదిగారు.  ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి.

మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ చిత్రంతో ఎన్టీఆర్ అస్సలు గుర్తించలేనంతగా మారిపోయాడు..సన్నగా కరెంట్ తీగలా కనిపించాడు. గత మూడు సంవత్సరాలుగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: