‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ సక్సస్ తరువాత అదే నెల చివరిలో ప్రారంభం అయిన చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోపై మెగా అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. అయితే ఈ షో ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్ నుండి ఈ షోకు మెగా అభిమానులే నెగిటివ్ మార్కులు వేయడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

అయితే ఈకార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మాటివి యాజమాన్యం ఈషోను రక్షించి ఈ షోకు రేటింగ్స్ పెరిగే విధంగా ఎన్నో మార్గాలను అన్వేషించారు. అయితే  బుల్లితెర పై ప్రసారం అయ్యే కొన్ని డైలీ పాపులర్ సీరియల్స్ రేటింగ్ స్థాయిని కూడ చిరంజీవి ‘మీలోఎవరు కోటీశ్వరుడు’  షో అందుకోలేక పోవడం అటు చిరంజీవికి ఇటు మెగా అభిమానులకీ చెప్పుకోలేని సమస్యగా మారింది.

ఈ నేపధ్యంలో ఈషో ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను విశ్లేషించడానికి మాటివి ఒక లోతైన అధ్యయనం చేసినట్లు టాక్. ఈకార్యక్రమంలో చిరంజీవి అడుగుతున్న క్వశ్చన్స్‌ కొన్ని మరీ సిల్లీగాను లేదంటే ఎవరికీ సమాధానం తెలియనంతగా ఉండటంతో సగటు బుల్లితెర ప్రేక్షులకు ఈషో పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనితో ఈ షోను రక్షించడానికి అనేక మార్గాలు ఆలోచించి ఇప్పుడు ఈ కార్యక్రమంలో వరస పెట్టి చిరంజీవి నిర్వహిస్తున్న సెలెబ్రెటీ రౌండ్స్ ను ప్రసారం చేస్తున్నారు. సెలబ్రిటీలతో కలిసి మెగాస్టార్ డాన్సులేస్తున్నా  హ్యూమర్ పరంగా సెటైర్లు వేస్తూ చిరంజీవి బుల్లితెర పై చెలరేగి పోతూ ఉన్నా ఇలా ఏమిచేసినా సరే  'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో మాత్రం అంచనాల్ని అందుకోలేకపోతోంది. 

దీనితో సెలెబ్రెటీలు వస్తున్నా ఈషోకి రేటింగ్స్ అంతంత మాత్రంగానే ఉండటం మాటివికి షాకింగ్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో సెలెబ్రెటీలు రంగంలోకి దిగినా ‘మీలోఎవరు కోటీశ్వరుడు’ షోను రక్షించలేక పోతున్నారు అంటూ కొందరు మెగా స్టార్ పై సెటైర్లు వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: