ఈ మద్య సినిమా హీరోల అభిమానులు చేస్తున్న వింత పనులకు సాక్షాత్తు హీరోలు సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితులు వస్తున్నాయి.  ఆ మద్య తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కొత్త సినిమా వస్తే చాలు అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంటుంది.  ఇక సినిమా మొదలయ్యే వారం ముందు నుంచి పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేయడం వాటికి పాలాభిషేకం చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలా పాలను ఉత్తగా కటౌట్లకు పోయడం ఏంటీ అని కొంత మంది విమర్శించడంతో రజినీ తన ఫ్యాన్స్ కి ఇలా చేయవద్దని చెప్పడం జరిగింది.  
Related image
మరికొంత మంది ఫ్యాన్స్ ఆ మద్య సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చచ్చిపోయినట్లుగా ఆయనకు పిండ ప్రధానం చేస్తున్నట్లు..శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు క్రియేట్ చేసి సంచనం సృష్టించారు.  మరికొంత మంది ఫ్యాన్స్ నేరుగా ట్విట్టర్ లో తమ అపోజిషన్ ఫ్యాన్స్ పై వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం చేస్తున్నారు. అభిమానుల అత్యుత్యాహం ఒక్కోసారి సెలబ్రిటీ లను ఇబ్బందులకు గురిచేస్తుందనడానికి నిదర్శనంగా విజయ్‌పై పోలీసు కేసు నమోదైంది.   తమిళ స్టార్ హీరో విజయ్ పై కేసు నమోదు అయ్యింది , అది కూడా ఓ అభిమాని చేసిన పనికి విజయ్ మీద కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది .  
Image result for pawan fans condolence varma
విజయ్‌కి వీరాభిమాని అయిన ఒక యువకుడు త్రిశూలం పట్టుకు న్నట్టు విజయ్‌ ఫోటోని రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ కావ డంతో అందరి దృష్టి ఫోటోపైకి మళ్లింది.ఐతే త్రిశూలాన్ని పట్టుకున్న విజయ్ కాలికి షూలు వేసుకుని ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందూ మక్కల్ మున్నని పార్టీ దీనిపై మండిపడింది.

షూలు ధరించి త్రిశూలం చేతపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ విజయ్ మీద పోలీసు కేసు పెట్టింది. ఎలాంటి సంబంధం లేకున్నా అభిమాని చేసిన అఘాయిత్యానికి తమిళ హీరో విజయ్ బలి అయ్యారు.  సో అభిమానం ఉండవొచ్చు కాని అది ఇతరులకు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని ఫ్యాన్స్ కి హితబోద చేస్తున్నరు..నటీ నటులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: