మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరంజీవి స్థాయికి ఎప్పుడు ఎదుగుతాడు అన్నది మెగా అభిమానుల చిరకాల కోరిక. ఇది చాలదు అన్నట్లుగా ఉపాసనతో చరణ్ కు పెళ్లి అయి 5 సంవత్సరాలు దగ్గరదగ్గర అయిపోతున్నా ఇంకా మెగా కుటుంబంలో జూనియర్ చరణ్ రాలేదు ఏమిటి అన్న ప్రశ్న అందరి మనసులలోను ఉంది. 

నిన్న చిరంజీవి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన విశ్లేషణాత్మకమైన ఇంటర్వ్యూలో కూడ మెగా స్టార్ కు జూనియర్ చరణ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తాత అని ఎప్పుడు పిలిపించుకుంటున్నారు అంటూ చిరంజీవిని అడిగితే ఆయన సింపుల్ గా 'ఇప్పటికే ముగ్గురితో పిలిపించుకుంటున్నాగా' అంటూ నవ్వుతూ సమాధానం దాటేసేందుకు ప్రయత్నించాడు. 

అయితే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి తాను అడుగుతున్నది రామ్ చరణ్ వారసుడి సంగతి అని స్పష్టంగా చెప్పే సరికి చిరంజీవి తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘అది రామ్ చరణ్ ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. అయినా త్వరలోనే ఆ ముచ్చటా తీరిపోతుందిలే' అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చి అనేక ప్రశ్నలకు తావిచ్చాడు చిరంజీవి. 

ఇదే సందర్భంలో తన వయస్సు గురించి మాట్లాడుతూ భగవంతుడు అవకాసం ఇస్తే తిరిగి తనకు మళ్ళీ 25 సంవత్సరాల చిరంజీవిగా మారి పోవాలని ఉంది అని చెపుతూ మరో షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనికి కారణం ప్రస్తుత తరం హీరోలను చూస్తుంటే తనకు ముచ్చట వేస్తోందని అందువల్లనే తాను కూడ 25సంవత్సరాల వయస్సు ఉన్న హీరోగా మారిపోతే ఎవరికీ అందని రికార్డులను బ్రేక్ చేయాలని ఉంది అంటూ ‘బాహుబలి 2’ రికార్డులను మనసులో పెట్టుకుని కామెంట్స్ చేసాడు చిరంజీవి.

అందుకే కాబోలు మూడు భాషలలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను చేస్తూ భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా అత్యంత భారీ రికార్డుల పై కన్ను వేసాడు మెగా స్టార్. కోట్లాది జనం హృదయాలలో మళ్ళీ తాను ‘ఖైదీ’ ని అయ్యాను అంటూ తన ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డుల గురించి మురిసిపోతున్నాడు మెగా స్టార్..  


మరింత సమాచారం తెలుసుకోండి: