తెలుగు ఇండస్ట్రీలో తన గ్లామర్ తో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అనుష్క. కేవలం గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. అరుంధతి,పంచాక్షరి,రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి చిత్రాల్లో లేడీ ఓరియెంట్ గా నటించింది..ఇక సైజ్ జీరో లో అయితే ఏకంగా తన బరువు పెంచుకొని మరీ నటించింది. ఇక బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
అయితే సైజ్ జీరో చిత్రం తర్వాత ఈ అమ్మడు బాగా బరువు పెరగడంతో సన్నబడటానికి నానా ఇబ్బందులు పడుతుంది. అయితే బాహుబలి చిత్రంలో అనుష్కను గ్రాఫిక్స్ టెక్నాలజీతో కాస్త సన్నగా కనిపించేలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మడికి 35 సంవత్సరాలు వచ్చాయి..కానీ ఇంకా పెళ్లి కాని కుమారిగానే ఉండటంతో అనుష్క పెళ్లిపై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
అనుష్క కు పెళ్ళి దోషాలు ఏమైనా ఉన్నాయేమో అందుకే పెళ్లి కావడం లేదేమో అని గుసగుసలు మొదలయ్యాయి . తాజాగా అనుష్క కుటుంబ సమేతంగా కర్ణాటక లోని మూకాంబిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది . కర్ణాటక లోని మూకాంబిక దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేయడంతో అనుష్క పెళ్లి కోసమే ఈ పూజలు చేసింది అంటూ దుమారం చెలరేగుతోంది. త్వరలోనే అనుష్క పెళ్లి అవడం మాత్రం ఖాయమని అంటున్నారు. రిగ్గా ఇదే సమయంలో గుడి కి వెళ్లడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.