సీనియర్ యాక్టర్ చలపతి రావు నోటిదూలతో రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో ఆయన మహిళలపై చేసిన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి. సినిమా ట్రైలర్ లో ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం అన్న డైలాగ్ ను లీడ్ తీసుకుని ప్రోగ్రాం రన్ చేయిద్దామనుకున్నారు. కాని చలపతి రావు అసభ్యకరమైన మాటలకు ఇప్పుడు సినిమాలోనే ఆ డైలాగ్ ఉంచాలా తీసేయాలా అని ఆలోచనలో పడ్డాడట నాగార్జున.   


అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కింగ్ నాగార్జున నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుకలో జరిగిన ఈ రచ్చ మీద రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా తెలిసిందే.  


అందుకే అసలు ఈ గొడవంతటికి కారణమైన మనాశ్శాంతికి హానికరం అన్న డైలాగ్ సినిమాలో తొలగించాలని నిర్ణయించుకున్నాడట నాగ్. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాగ్ మాట కాదనలేడు కాబట్టి నిర్ణయం నాగార్జునదే. మరో 48 గంటల్లో థియేటర్లోకి రానున్న రారండోయ్ సినిమా ఈ రేంజ్ లో హాట్ న్యూస్ గా నడుస్తుండటం పబ్లిసిటీ పరంగా ఓకే కాని ఈ నెగటివ్ ఎఫెక్ట్ సినిమా మీద పడకుండా చూడాలని నాగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.


చలపతి రావు అన్న మాటలను తాను మాత్రమే కాదు చిత్రయూనిట్ అందరిచేత ఖండించేలా మెసేజ్ పాస్ చేయించిన నాగ్ సినిమా మీద ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ పడకుడదని చూస్తున్నాడు. అసలు సినిమాలో ఆ డైలాగ్ ఎక్కడ ఎప్పుడు వస్తుందో చూసి అది ఉంచాలా తీసేయాలా అని తేలుస్తాడట నాగ్. మొత్తానికి చలపయ్య అన్న మాటలకు ఇప్పుడు నాగార్జున రిస్క్ లో పడ్డాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: