త్వరలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా తొలిసారి నటించిన రారండోయ్ వేడుక చూద్దాం.. విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నటులు, దర్శకులు అంతా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ భలే ఆకట్టుకుంటోంది. అమ్మాయిలు మనశ్సాంతికి హానికరం అంటూ నాగచైతన్య ఇచ్చే స్లోగన్ ఆకర్షించేలా ఉంది. 

Image result for rarandoi veduka chuddam pics

ఇప్పుడు ఈ స్లోగన్ పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి.  పలువురు స్పందిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై బాగానే రియాక్టయ్యింది. త‌న‌ను ఎవరైనా ఇదే ప్రశ్న అంటే... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని క్వశ్చన్ చేస్తే.. అమ్మాయిల సంగతి పక్కకు పెట్టండి.. అబ్బాయిలు మాత్రం పాయిజనెస్‌ అని చెబుతానంటూ సెటైర్ వేసింది. 

Image result for rarandoi veduka chuddam pics

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ భ్రమరాంబ అనే క్యారెక్టర్ లో నటిస్తోంది. తొలిసారిగా హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నానని రకుల్ గర్వంగా చెబుతోంది. అంతే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో పెద్ద డోలును మెడలో వేసుకుని భలేగా వాయిస్తూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో త‌న పాత్రకి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంద‌ంటున్న రకుల్.. తాను తెలుగు నేర్చుకుంటానంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: