తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మళియళ ముద్దుగుమ్మ సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేసు లో నిలిచింది. అయితే ఇండస్ట్రీలో ఏ చిన్న సంఘటనలు జరిగినా అది పాజిటీవ్ గానో..నెగిటీవ్ గానో వెంటనే ట్విట్టర్ లో స్పందిస్తుంది. గతంలో మహేష్ - సుకుమార్ కాంబోలో వచ్చిన ' నేనొక్కడినే ' పోస్టర్ విషయంలో ఆడవాళ్ళని అవమానించారంటూ సమంత రియాక్ట్ అయ్యింది. ఆ సమయంలో మహేష్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
అలాంటి సమంతపై ఇప్పుడు మరోసారి విమర్శలు వస్తున్నాయి. కారణం ఈ మద్య ‘రారండోయ్ వేడుక చూద్దం’ లో సీనియర్ నటులు చలపతి రావు ‘అమ్మాయిలు పక్కలో పనికి వస్తారు ’ అని కామెంట్ చేయడం పెద్ద దుమారానికి తెరలేపింది. ఈ విషయంపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే మహిళలపై ఏ చిన్న వ్యాఖ్యలు చేసినా వెంటనే రియాక్ట్ అయ్యే సమంత సీనియర్ నటులు చలపతి రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలపకపోవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే సమంత ఈ విషయంలో సైలెంట్ గా వుండడం నెటిజన్లకి నచ్చలేదు. మరి సమంత ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.