తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నాగ్ మన్మధుడు, కింగ్ నాగార్జునగా పిలువబడుతున్నారు. ఈయన వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నాగ చైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అయ్యింది. కొన్ని సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోయినా చైతూకి మాత్రం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.
ఈ సంవత్సరం ప్రేమమ్ తో మంచి హిట్ కొట్టిన నాగ చైతన్య తాజాగా కుటుంబ నేపథ్యంలో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ చిత్రంలో నటించారు. ఈ రోజు రిలీజ్ అయిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ సినిమాపై మొన్నటి వరకు భారీగానే అంచనాలు వేసుకున్నారు అక్కినేని ఫ్యామిలీ. అంతే కాదు చిత్రం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు అమ్మాయిలపై అసహ్యమైన కామెంట్స్ చేయడంతో సినిమాపై ఏమైనా ప్రభావం పడుతుందా అని అనుమానాలు కూడా కలిగాయి. దీంతో కొన్ని డైలాగ్స్ ఆ సినిమాలోంచి తీశారని వినికిడి.
ఈ రోజు రిలీజ్ అయిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ సినిమా ఇద్దరు స్నేహితుల మద్య కొనసాగే చిత్రం అని మంచి ప్రేమ తో కూడుకున్న చిత్రం అని దర్శకులు మొదటి నుంచి చెప్పుతూ వస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రం అంటూ కితాబు నిచ్చారట . పైగా నాగార్జున కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే పాటలు మంచి హిట్ అయ్యాయి , నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ ల జోడీ చూడముచ్చటగా ఉంది .
ఇక మరో విశేషం ఏంటంటే సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం. ఇప్పటికే ప్రీమియం చూసిన వారు సినిమాపై మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్ టాక్ ఎలా ఉందో కొద్ది గంటల్లో తెలుస్తుంది. చైతూ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్టా..ఫట్టా అనే విషయం రేపటి వరకు తెలియనుంది.