తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్. దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు. సందీప్ చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో మే 7 1987 న జన్మించారు.
ఈయన తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసింది..తండ్రి పారిశ్రామిక వేత్త. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. సందీప్ కిషన్ మామయ్యలు "ఛోటా కె.నాయుడు" మరియు "శ్యాం కె.నాయుడు. స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్కిషన్ బాలీవుడ్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు.
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్ చిత్రంలో సందీప్కిషన్తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ మరియు మంచు లక్ష్మి నటిస్తున్నారు. కృష్ణ వంశి దర్శకత్వంలో వస్తున్న ‘నక్షత్రం’ చిత్రంపై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.