తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రశంసలు పొందిన సుమకు తాజాగా దువ్వాడ జగన్నాథం ఆడియో ఫంక్షన్లో పెద్ద షాక్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకులు హరీష్ శంకర్ పెద్ద షాక్ ఇచ్చారు. యాంకర్ సుమకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె వేసే ఫన్నీ సెటైర్స్ స్టేజీపై వున్న వారినే కాదు... ఎక్కడో దూరంగా టీవీల ముందు కూర్చుని లైవ్ చూస్తున్న వారిని సైతం కితకితలు పెడతాయి.. కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ మద్య యాంకర్లు స్టేజ్ పై ఏవి పడితే అది మాట్లాడుతున్నారు..చాలా కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారు.

అయితే ఈ విషయంపై సుమకు షాక్ ఇచ్చారనుకుంటే..పొరపాటే. ఇప్పటి వరకు యాంకర్ సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు..కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆమెను పొగడలేదు. కాకపోతే సుమ కేరళా అమ్మాయి అయినా..తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతుందీ అన్నారు.  ఇక దువ్వాడ జగన్నాథం లో ‘మెచ్చుకో’ అనే సాంగ్ ని వేదికపై కూర్చున్న దిల్ రాజు, హరీష్ శంకర్ లను లాంచ్ చేయాల్సిందిగా సుమ కోరింది.  అంతే వారిచ్చిన షాక్ కి సుమ కాసేపు ఆశ్చర్యంలో మునిగిపోయింది.

దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లు నిర్వహించింది కానీ ఎప్పుడు ఆమెను ఎవ్వరూ పొగడలేదు..కానీ ఈ సారి మాత్రం సుమ గొప్ప చాన్స్ ఇస్తున్నామని ‘మెచ్చుకో’ సాంగ్ సుమ లాంచ్ చేయాల్సింది గా కోరారు.  దీంతో యంకర్ సుమ ఒక్కసారిగా షాక్ కి గురైంది..ఈ అనుకోని పరిణామానికి ఖంగుతిన్న సుమ.. ఎన్నో ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేసిన తాను ఎప్పుడూ ఇలా సినిమా పాటలు లాంచ్ చేయలేదని.. మొదటిసారిగా తన చేతుల మీదుగా ఓ సినిమా పాట లాంచ్ అవుతోందని అన్నారు. ఈ సాంగ్ లాంచింగ్ ద్వారా 'దువ్వాడ జగన్నాథమ్' చరిత్ర పుటల్లో తనకీ ఓ పేజీ వుంటుందంటూ అలవాటు ప్రకారమే సుమ తనదైన స్టైల్లో డైలాగ్ కొట్టడంతో ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన అందరూ ఒక్కసారే నవ్వుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: