‘డీజే’ విడుదలకు ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ వేగం పెంచాడు అల్లుఅర్జున్. ఈ సినిమాకు  సంబంధించి ఇంట‌ర్వ్యూల పర్వం మొద‌లైంది. అల్లు అర్జున్ ఈరోజు ప్రింట్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి అయితే ఆ ఇంటర్వ్యూల నిర్వహణ కొంత విచిత్రంగా జరగడంతో ఆఇంటర్వ్యూల తీరుచూసి మీడియా వర్గాలు షాక్ అయినట్లుగా తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక్కో మీడియా ప్ర‌తినిథికీ కేవ‌లం 5 నిమిషాల స‌మ‌యం మాత్రమే బ‌న్నీ పీఆర్వోలు ఇచ్చారు అని టాక్. అంతేకాదు  బన్నీ ఇంట‌ర్వ్యూ ఇచ్చేట‌ప్పుడు బ‌న్నీ చుట్టూ క‌నీసం ప‌దిమందైనా వలయంలా అల్లు అర్జున్ పక్కన ఉన్నట్లు తెలుస్తోంది. హ‌రీష్ శంక‌ర్‌, దిల్ రాజు, బ‌న్నీ పీఆర్వోలు, ఈ సినిమా పీఆర్వోలూ ఇలా అందరు కలిసి కూర్చోవడంతో అది అల్లుఅర్జున్ తో ఇంటర్వ్యూ అనుకోవాలా లేదంటే ఏదైనా మూకమ్మడి ఇంటర్వ్యూ అనుకోవాలా అనే సందిగ్ధంలో మీడియా వర్గాలు పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ‘డీజే గురించి త‌ప్ప మ‌రో ప్ర‌శ్న అడ‌క్కండి` అంటూ ముందే గ‌ట్టిగావీరంతా గట్టిగా చెప్పడంతో ఈఇంటర్వ్యూలు అన్ని మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయినట్లు టాక్. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ కోసం ఒక ప్రత్యేక విమానాన్ని దిల్ రాజ్ ఏర్పాటు చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈ సినిమాకు మరింత హైక్ తీసుకు రావడానికి ఒక ప్రత్యేక విమానంలో అల్లు అర్జున్ ఈనెల 21న బయలుదేరి విజయవాడ విశాఖపట్టణం తిరుపతి ప్రాంతాలలో ఒకేరోజు మూడు మీడియా సమావేశాలలో పాల్గొనడమే కాకుండా ఆ ప్రాంతాలలోని తన అభిమాన సంఘాల ప్రతినిధులను కూడ కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ‘దువ్వాడ’ భారీ కలక్షన్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: