భారత దేశంలో క్రికెట్ అంటే ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మన ఆటగాళ్ల ఆటపై ఎప్పుడూ ప్రశంసల జల్లు కురిపించే వారు నిన్న పాకిస్థాన్ తో జరిగిన ఆటలో ప్రదర్శన చాలా పేలవంగా ఉండటం..ఓడిపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) తీవ్ర ఆరోపణలు గుప్పించాడు.  
Virat Kohli, KRK, India vs Pakistan
కమల్ రషీద్ ఖాన్ ఒక అడుగు ముందుకు వేసి కోహ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని, అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతన్ని బహిష్కరించాలని, జైలుకు పంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు.  అంతే కాదు తన ట్విట్ లో ‘సోదరా కోహ్లీ, నువ్వు ఇచ్చిన క్యాచ్ ను పాకిస్థాన్ ఫీల్డర్లు వదిలేశారు. ఆ తర్వాతి బంతికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్ కు పాల్పడ్డావని స్పష్టంగా అర్థమైంది’ అన్నారు.
Image result for kohli dhoni yuvraj singh
నిన్న జరిగిన మ్యాచ్ ని భారతీయులు ఎంతో ప్రతిష్టగా భావించారని వారందని మనోభావాలు దెబ్బతినేలా ఆట కొనసాగిందని విమర్శించాడు.  భారతీయుల ప్రతిష్టను పాకిస్థాన్ కు అమ్మేసిన కోహ్లీపై జీవితకాల నిషేధం విధించాలి .. జైలుకు పంపాలి. ఇక కోహ్లీ తో పాటు తామేమీ తక్కువ తినలేదని నిరూపించిన యువరాజ్ సింగ్, ధోనీ కూడా ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు..’ అంటూ కేఆర్కే తన ఇష్టానుసారం ఆరోపణలు చేశాడు.  
Image result for pakistan win
ఎప్పుడు ఏదో ఒక విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కమల్ రషీద్ పై అటు భారత, పాక్ క్రికెట్ అభిమానులు రుస రుసలాడుతున్నారు.  ఆట అన్న తర్వాత గెలుపు ఓటమి ఉంటుందని ఓటమి పాలైనంత మాత్రాన మ్యాచ్ ఫిక్స్ అంటే ఎలా అని ఇలాంటి నిరాదారమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: