‘బాహుబలి’ ప్రాజెక్ట్ తరువాత ఇండియన్ సినిమా సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఎందరో ప్రముఖ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికాలో రోజులు గడుపుతూ వచ్చాడు. అయితే ఇప్పడు  ప్రభాస్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్‌ తో 150 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చు కున్నట్లుగా  బాలీవుడ్ మీడియా రాస్తున్న వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రభాస్‌ తో ఈ డీల్ ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నుండి ప్రభాస్ 150 కోట్ల భారీ అమౌంట్ అందుకోబోతున్నాడని టాక్. ప్రభాస్ కెరీర్లోనే ఇది అతిపెద్ద డీల్ అని అంటున్నారు. అయితే ఈ 150 కోట్ల డీల్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్ తరుపున ప్రభాస్ మూడు  సినిమాలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. త్వరలోనే ఈ డీల్ గురించి పూర్తి అధికారిక వివారాలు ప్రకటిస్తారు అని అంటున్నారు. 

బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ అమెరికా టూర్ లో ఉన్నప్పుడే కరణ్ జోహార్ నుండి ఈ ప్రోపోజల్ వచ్చిందని అయితే ప్రభాస్ తన సన్నిహితులతో అనేక ఆలోచనలు చేసి ఫైనల్ గా ఈ డీల్ కు తన అంగీకారం తెలిపాడు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి డీల్ ఫైనల్ అయినా ప్రభాస్ నటించే మొట్టమొదటి హిందీ సినిమా 2018 లో మాత్రమే మొదలు అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

దీనికి కారణం ‘సాహో’ మూవీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదాకా మరి ఏ కొత్త సినిమాను ప్రభాస్ ప్రారంభించే ఉద్దేశ్యంలో లేడు. దీనితో వీలైనంత త్వరగా ‘సాహో’ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభాస్ స్థిర నిశ్చయంతో ఉన్నట్లు టాక్. ఏదీ ఏమైనా ఈ 150 కోట్ల డీల్ వార్తలు టాలీవుడ్ ప్రభాస్ రేంజ్ ని మరింత పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: