బాహుబలి' ప్రాజెక్టుతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఆ సినిమా కోసం తన కెరీర్‌ ను పణంగా పెట్టి దాదాపు 4 ఏళ్ళు  మరి ఏ  సినిమాను చేయకుండా చేసిన సాహసానికి ఈరోజు పరిపూర్ణమైన సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ ఇచ్చిన క్రేజ్ తో ప్రభాస్ పారితోషికం సుమారు 50 కోట్లకు చేరుకుంది అన్న వార్తలను బట్టి ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది.

అయితే అటువంటి ప్రభాస్ కు ‘బాహుబలి 3’ పేరు వినగానే షాక్ కొట్టినట్లు ఉలిక్కి పడి అనుకోకుండా నోటి వెంట బూతులు వచ్చిన సంఘటన ఈమధ్య జరిగింది. ‘బాహుబలి’ తో ప్రభాస్ తో సమానంగా క్రేజ్ వచ్చిన రానా హోస్ట్ చేస్తున్న నెం.‘1 యారి’ కార్యక్రమానికి సంబంధించి ‘బాహుబలి’ సృష్టి కర్త రాజమౌళి నిర్మాత శోభు యార్లగడ్డ అతిధులుగా వచ్చిన కార్యక్రమంలో రాజమౌళి ప్రభాస్ ను ఆట పట్టించడానికి ప్రభాస్ కు ఫోన్ చేసి ‘బాహుబలి 3’ చేస్తున్నాను రెడీగా ఉండు అని రాజమౌళి అన్నప్పుడు ప్రభాస్ షాక్ తో ‘అమ్మ నీయమ్మ’ అంటూ తన ఆశ్చర్యాన్ని రాజమౌళికి వ్యక్త పరిచాడు. 

దీనితో ప్రభాస్ నోటివెంట ఆ మాటలు విన్న రాజమౌళి రానాలు తెగ నవ్వుకున్నారు. జూన్ 25వ తారీఖు నుండి ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ట్రైలర్ లో ఈ విషయాలు బయట పడ్డాయి. 
ఇప్పుడు ఈ ప్రోమో వీడియోను అందరూ అత్యంత ఆశక్తిగా చూస్తున్నారు.  

ఇదే కార్యక్రమంలో కార్యక్రమ హోస్ట్ రానా రాజమౌళి చేత విల్లు చేత పట్టించి బాణాలు గురి పెట్టించాడు. రానా ఒకొక్క హీరో పేరు చెపుతుంటే రాజమౌళి గురి చేసి తన బాణాలను ఎక్కుపెట్టాడు. అయితే అప్పటిదాకా బాణాలు గురి తప్పినా పవన్ కళ్యాణ్ పేరు రానా నోటి వెంట విన్న వెంటనే రాజమౌళి గురి తప్పకుండా తన లక్ష్యం వైపు బాణాన్ని వదిలి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ షోలో ఉండటంతో ఈ ‘1 యారి’ కి రేటింగ్స్ బాగా వచ్చే ఆస్కారం ఉంది..
 



మరింత సమాచారం తెలుసుకోండి: