బాబాయి – అబ్బాయి ల సినిమాలు ఎవడు, అత్తారింటికి దారేది సినిమాలు కేవలం ఒక వారం రోజుల గ్యాప్ తో టాలీవుడ్ స్క్రీన్ పై పోటీ పడడం ఖాయం అవడంతో, ఈ పోటీలో విజేతగా నిలవడానికి కేవలం ఒకేఒక వారంలో ఏకంగా 50 కోట్లు కొల్లగొట్టడానికి హీరో రామ్ చరణ్ యాక్షన్ ప్లాన్ తో సిద్ధం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. గతంలో చెర్రీ హీరోగా నటించిన ‘రచ్చ’, ‘నాయక్’ లు మొదటి వారంలో 30 కోట్లు వసూలు చేశాయి కాబట్టి ప్రస్తుతం రామ్ చరణ్ అనుకుంటున్న 50 కోట్ల కలెక్షన్ టార్గెట్ అసాధ్యం కాదని అతడి అభిప్రాయం అట.

గతంలో వచ్చిన చరణ్ సినిమాల కన్నా వీలైనన్ని అత్యధిక ధియేటర్స్ లో సినిమాను విడుదల చెయ్యడం యాక్షన్ ప్లాన్ లో మొదటి పాయింట్ అయితే, ఈ సినిమా విడుదల కాకముందే అమెరికా వెళ్లి అక్కడి తెలుగువారి దగ్గర ఎవడు సినిమాకు హైక్ తీసుకురావడానికి వీలైనన్ని సినిమా ప్రచార కార్యక్రమాలు అమెరికాలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో నిర్వహించడం ద్వారా, ఇప్పటివరకు ఓవర్ సిస్ లో ఏ సినిమాకూ రాని హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రాబట్టి 50 కోట్ల టార్గెట్ ను అటు ఆంధ్రా లోనూ ఇటు అమెరికాలోనూ కలుపుకొని సాధించవచ్చని తన కొత్త యాక్షన్ ప్లాన్ పై తీవ్రంగా కసరత్తు చేయడమే కాకుండా దానికి సంబంధించిన హోర్రేత్తించే ప్రచార కార్యక్రమాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ లో అటు అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చెయ్యడమే కాకుండా ఈ సినిమా విడుదల లోపే అమెరికా వెళ్ళడానికి చెర్రి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్లాన్ లో బాగంగానే జూలై 31 న విడుదల కావలసిన ఎవడు ను జూలై 27 కు విడుదల చేసి, కలెక్షన్స్ రాబట్టుకోవడానికి రోజులు పెంచుకొనే యోచనలో ఉన్నాడట చెర్రీ. తెల్ల కాగితం పై రామ్ చరణ్ రాసుకున్న యాక్షన్ ప్లాన్ బాగుంది కాని ప్రస్తుతం ఎటువంటి పండుగలూ, అలాగే చెప్పుకోదగ్గ హాలీ డేస్ లేని ఈ నెలలో ఈ యాక్షన్ ప్లాన్ ఎంత వరకు విజయవంతం అవుతుంది అన్నదే ప్రశ్నార్ధకం....?
 

మరింత సమాచారం తెలుసుకోండి: