జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ ఆ పాపులారిటీతో ఢీ జోడిలో కూడా రష్మితో రెండు టీంలలో ఒక టీం లీడర్ గా వ్యవహరించాడు. ప్రతి ఎపిసోడ్ లో సుధీర్, రష్మి, ప్రదీప్ లు కలిసి చేసే జబర్దస్త్ స్కిట్ అందరిని కడుపుబ్బా నవ్వించాయి. ఈ క్రమంలో గ్రాండ్ ఫైనల్ లో చీఫ్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి, రమా గార్లను ఆహ్వానించారు. 


బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ సినిమా హిస్టరీలో మిగిలిపోయే చేసిన రాజమౌళికి ఢీ జోడి వారు కూడా గ్రాండ్ ఎంట్రీ ఇప్పించారు. రాజమౌళిని ఇంప్రెస్ చేసే క్రమంలో సుధీర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మగధీర లాంటి సూపర్ హిట్ తర్వాత సునీల్ తో మర్యాద రామన్న సినిమా చేశారు రాజమౌళి. సో ఇప్పుడు కూడా బాహుబలి తర్వాత సుధీర్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని చెప్పుకొచ్చాడు.


ఇండైరెక్ట్ గా రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలన్న కోరిక బయట పెట్టాడు సుడిగాలి సుధీర్. ప్రదీప్ తో ఈసారి రాజమౌళి మర్యాదరామన్న చేస్తే అందులో హీరోగా వెన్నెల కిశోర్, సప్తగిరి లాంటి వారిని పెట్టుకుంటాడు అనగా సుధీర్ తన కేసి చూపిస్తూ ఇటు చూసి చెప్పవయ్యా అంటూ కామెడీ చేశాడు.


ఎంత జబర్దస్త్ షోతో పాపులర్ అయినా.. ఎంత ఢీ జోడితో ఆకట్టుకున్నా సరే రాజమౌళి డైరక్షన్ లో చేసేంత సీన్ సుధీర్ కు అప్పుడే రాలేదని కొంతమంది వాదన. ఏదైమైనా ఢీ జోడితో ప్రేక్షకులకు మరింత చేరువైన సుధీర్ చూస్తుంటే వెండితెర మీదకు హీరోగా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: