అతనో నిర్మాత కొడుకు.. మొదటి సినిమా వినాయక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇప్పించినా లాభం లేకుండా పోయింది. ఇక తర్వాత ఓ సూపర్ హిట్ రీమేక్ తో ఎంత స్పీడుగా వచ్చాడే అంతే స్పీడ్ గా వెళ్లాడు. ఇక ముచ్చటగా మూడో సినిమాగా స్టార్ డైరక్టర్ హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చే దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. అతనే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.


అల్లుడు శ్రీను, స్పీడున్నోడు ఫలితాలు నిరాశ కలిగించడంతో ఈసారి కొడితే గట్టిగాని ఫిక్స్ అయ్యి మరి సరైనోడు తర్వాత బోయపాటి లాంటి స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ వారసుడు. ఎలాగైనా తనయుడిని హీరోగా నిలబెట్టాలనే సురేష్ తాపత్రయం సినిమాకు ఎంత ఖర్చు అయినా పెట్టేస్తున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ స్పెషల్ రోల్ చేస్తుంది. ఇక ఈ ఇద్దరు చాలదు అన్నట్టు కేథరిన్ త్రెసాతో ఓ హాట్ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట.


రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ సినిమాకు జయ జానకి నాయకా అని టైటిల్ పెట్టారు. బోయపాటి మార్క్ కత్తిపెట్టి నరకడమే మరి టైటిలేమో విచిత్రంగా ఉంది. అయినా సరే సినిమాకు భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. నైజాం లో ఈ సినిమా 9 కోట్లకు దిల్ రాజు కొనుక్కోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఆంధ్రాలో 7 కోట్లు, సీడెడ్ లో మరో 7 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్సే పాతిక కోట్లు కొట్టేశాడు బెల్లంకొండ శ్రీను. 


మరి సినిమాలో నిజంగా అంత కంటెంట్ ఉందా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం. ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హిట్ కిక్కు దక్కించుకోవాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి అదిరిపోయే బిజినెస్ చేస్తున్న ఈ సినిమా అదే రేంజ్ అదరగొట్టే హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: