‘బాహుబలి 2’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ కు సంబంధించిన వార్తలు వ్రాయకుండా బాలీవుడ్ మీడియాకు ఒక్కరోజు కూడ గడవడం లేదు. ఈమధ్య కాలంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వార్తలు రావడంతో పాటు ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. 

అయితే అటువంటి బాలీవుడ్ ఎంట్రీ జరిగితే అది కరణ్ జోహార్ సినిమాతోనే ఉంటుంది అని అనుకున్నారు అంతా. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రభాస్ ప్రభాస్‌తో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా తో చర్చలు జరుపుతున్నాడు అని వార్తలు రావడం మరింత సంచలనంగా మారింది. 

అంతేకాదు ప్రభాస్ సన్నిహితులు అయిన మూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన ఒక ఆఫీసును ముంబాయిలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రభాస్ కు సంబంధించిన ఒక మేనేజర్ ను ముంబాయిలో నియమించడంతో ప్రభాస్ నిజంగానే బాలీవుడ్ వైపు చూస్తున్నాడా అన్న సందేహాలు కలిగించడం అత్యంత సహజం. ఇది ఇలా ఉండగా ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్‌ను అబుదాబీ తోపాటు యూరప్ దేశాల్లో జరుపాలని యూవీ ప్రొడక్షన్ నిర్ణయించింది అని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కథ రీత్యా ఈ దేశాలలో చిత్రీకరించ వలసిన అవసరం ఏర్పడటంతో ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నీ విదేశాలలోనే చిత్రీకరిస్తారు అని టాక్. ‘బాహుబలి 2’ తరువాత విడుదల కాబోయే ప్రభాస్ సినిమా కాబట్టి ఈ సినిమా నిర్మాతలు ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి బయ్యర్లు రెడీగా ఉన్నట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: