బాలకృష్ణ జూనియర్ల మధ్య దూరం పెరిగిపోయి చాల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వీరిద్దరిని దగ్గర చేయడానికి వీరిద్దరి సన్నిహితులు గతంలో చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి అన్న ప్రచారం ఉంది. అయితే ఇంత గ్యాప్ ఏర్పడినా బాలకృష్ణ జూనియర్ లు తమ మనసులోని మాటలను తమ సన్నిహితుల వద్ద కూడ బయట పెట్టరు అని అంటారు. 

సామాన్యంగా వీరిద్దరు నటించే సినిమాలు ఒకరి పై ఒకరు పోటీగా విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అనే కామెంట్స్ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ నటించిన ‘డిక్టేటర్’ .నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి రేస్ కు విడుదలైన నేపధ్యంలో ఈ రెండు సినిమాలు కలక్షన్స్ పరంగా కొంత వరకు దెబ్బ తిన్నాయి అన్న ప్రచారం ఉంది. 

అయితే ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ కావడం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిన్న రంజాన్ సందర్భంగా కళ్యాణ్ రామ్ జూనియర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ మూవీని సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం బాలకృష్ణ అభిమానులకే కాక బాలయ్యకే షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే బాలకృష్ణ ‘పైసా వసూల్’ రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 29గా ప్రకటించిన నేపధ్యంలో ఆ డేట్ ను లెక్క చేయకుండా కేవలం ఒక్క వారం ముందు జూనియర్ సినిమా ఏమిటీ అని తన తీవ్ర అసహనాన్ని బాలయ్య కళ్యాణ్ రామ్ కు చేరవేసినట్లు గాసిప్పులు వస్తున్నాయి. అయితే ఈ అనుకోని వార్ ను తప్పిద్దామని కళ్యాణ్ రామ్ ప్రయత్నించినా ‘జై ల కుశ’ కు సంబంధించిన నిర్మాణ సమస్యలు ఈ సినిమా రిలీజ్ డేట్ ను బాలయ్య సినిమా డేట్ కు దగ్గరకు చేర్చినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ‘జై లవ కుశ’ షూటింగ్ జూలై నేలాఖరి వరకు కొనసాగుతుంది. ఆ తరువాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు గ్రాఫిక్స్ కు కనీసం 45 రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో అనుకోని పరిస్థుతులలో ఇలా మళ్ళీ మరొకసారి నందమూరి హీరోల వార్ జరగబోతోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆఖరి నిముషంలో ఎదో ఒక మార్పు జరిగి ఈ నందమూరి వార్ తప్పితే బాగుటుంది అన్న ఫీలింగ్ లో నందమూరి అభిమానులు ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: