స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే రచ్చ అందరికి తెలిసిందే ఈ క్రమంలో ఓ పక్క ఫ్యాన్స్ చేసే హంగామా కన్నా యాంటీ ఫ్యాన్స్ చూపే అత్యుత్సాహం సినిమా వాళ్లకు తలనొప్పిగా మారుతుంది. రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. 


పూజా హెగ్దె హీరోయిన్ గా గ్లామరసం పండించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ సినిమా మొదట మిక్సెడ్ టాక్ వచ్చినా తర్వాత సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలో బన్ని బ్రాహ్మణ పాత్ర వేయడంతో ఇదవరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన అదుర్స్ చారి పాత్రకు దీన్ని ముడిపెడుతున్నారు.  


ఈ విషయంపై నిన్న జరిగిన డిజె థ్యాంక్స్ మీట్ లో డైరక్టర్ హరిష్ మరోసారి ఫైర్ అయ్యాడు. హీరో బ్రాహ్మణుడుగా చెసిన సినిమాలు చాలా తక్కువ మైకెల్ మదన కామరాజులో కమల్ హాసన్, ముగ్గురు మొనగాళ్లులో చిరంజీవి, అదుర్స్ లో ఎన్.టి.ఆర్ అంటూ పోల్చి చెప్పాడు. తను చెప్పదలచుకున్న పాయింట్ ఏంటంటే అదుర్స్ ఎన్.టి.ఆర్ కన్నా బన్ని అంత గొప్పగా ఏం చేయలేదు అన్నదానికి క్లారిటీ ఇస్తూ బన్నిని పైకెత్తే విధంగా మాట్లాడాడు.


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హరిష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చేశాడు కాబట్టి బన్ని వైపు ఉండి అన్ని మాటలంటున్నాడు. ఎప్పుడో ఒకసారి మళ్లీ ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి వస్తే కష్టమే కదా. ముఖ్యంగా సినిమా మీద వస్తున్న విమర్శల గురించి యాంటీ ఫ్యాన్స్ పై హరిష్ తన మార్క్ సెటైరికల్ గా స్పీచ్ ఇచ్చి అదరగొట్టాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: