కొరియో గ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసిన రాకేష్ మాస్టర్ పేరు ఎరగని వారుండరు. అయితే ఈమధ్య కాలంలో చాలామంది యంగ్ టాలెంటెడ్ కొరియో గ్రాఫర్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేపధ్యంలో రాకేష్ మాష్టర్ ప్రస్తుతం కాస్త మరుగున పడ్డాడు. 

అయితే ఇతడు కృష్ణవంశీని టార్గెట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కృష్ణవంశీ ‘చక్రం’ సినిమా సమయంలో ‘జగమంత కుటుంబం’ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసె సమయంలో తనను పిలిపించి తన పై తన ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా చేసిన వివాదాస్పద కామెంట్స్ ను సవివరంగా ఈ ఇంటర్వ్యూలో తెలియచేసాడు. 

కృష్ణవంశీ సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేసి చూపించు అని అడిగాడని సీన్ వివరించకుండా డ్యాన్స్ ఎలా చేస్తాం అని తాను కామెంట్ చేస్తే తన పై చెప్పుకోవడానికి కూడ వీలులేని పదాలతో కృష్ణవంశీ తనను టార్చర్ పెట్టిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు వెండితెరపై నీతులు చెప్పే దర్శకులు కొందరు రియల్ లైఫ్ లో మాత్రం పరమ నీచంగా ఉంటారు అంటూ ఫిలిం ఇండస్ట్రీలోని చీకటి కోణాలు బయట పెట్టాడు రాకేష్ మాష్టర్.

ఇదే సందర్భంలో ఈ వివాదాస్పద కోరియోగ్రఫర్ మాట్లాడుతూ తాను మాట్లాడిన ప్రతీ విషయం పై తనకు క్లారిటీ ఉందని తాను ఏ విషయంలోనూ ఎవరికీ భయపడను అంటూ మరో సంచలనానికి తెర లేపాడు రాకేష్ మాష్టర్. అయితే ఎప్పుడో విడుదలై ఫెయిల్ కూడ అయిపోయిన ‘చక్రం’ సినిమా గురించి ప్రస్తుతం సినిమాలు లేక అవస్థ పడుతున్న కృష్ణవంశీ గురించి రాకేష్ మాష్టర్ అప్పటి విషయాలను ఇప్పుడు తెర పైకి ఎందుకు తీసుకు వచ్చాడో సమాధానంలేని ప్రశ్నగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: