మలయాళ భామలకు టాలీవుడ్ లో ఉండే క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా చూస్తే మలయాళ భామలే తెలుగులో ఫుల్ ఫాంలో ఉన్నట్టు గమనిస్తున్నాం. వచ్చి రాగానే ఇక్కడో హిట్ పడితే చాలు ఇక ఇక్కడ స్టార్ స్టేటస్ సంపాదించినట్టే. ప్రస్తుతం అదే ఫాంలో కీర్తి సురేష్ ఫుల్ క్రేజ్ సంపాదించగా ఇప్పుడు ఆ లిస్ట్ లో అను ఎమాన్యుయెల్ కూడా చేరింది.  


నాచురల్ స్టార్ నాని మజ్ఞు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఎమాన్యుయెల్ ఆ సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాతనే వచ్చిన రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. అదే క్రేజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ త్రివిక్రం మూవీలో ఛాన్స్ పట్టేసిన అను అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న నా పేరు సూర్యలో కూడా ఆమె హీరోయిన్ ఫైనల్ చేశారట.


ఒకేసారి పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ సినిమాల్లో ఛాన్స్ పట్టేసిన అను ఎమాన్యుయెల్ చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించే అవకాశాలే కనిపిస్తున్నాయి. త్రివిక్రం కూడా తను తర్వాత ఎన్.టి.ఆర్ తో తీసే సినిమాలో అనుకే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. 


మలయాళ భామల హవా తెలుగులో ఏ రేంజ్ లో ఉందో అనుతో పాటుగా మిగతా మలయాళ హీరోయిన్స్ కు వచ్చే అవకాశాలను బట్టే అర్ధం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఛాన్స్ వాడుకుంటున్న అను తెలుగులో ఎలాంటి స్టార్ పొజిషన్ చేరుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: