విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమా చూసిన వారందరికీ  అందులో విలన్ పాత్ర పోషించిన అందులో విలన్ పాత్ర పోషించిన కళాభవన్ మణి  అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. కోచిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మణి నిన్న 7.15 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.  కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం కళాభవన్ మణి ది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికీ హత్యే అని విచారణ జరిపించాలని పోలీస్ కేసు పెట్టారు.  
హీరోయిన్ విషయంలో ఇదీ విషయం..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. తాజాగా కళాభవన్ మణి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.  రళలో సంచలనం సృష్టించిన నటుడు దిలీప్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. దక్షిణాది నటి పైన ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన దౌర్జన్యం, అఘాయిత్యం, అసభ్య ప్రవర్తన కేసులో దిలీప్ అరెస్టయిన విషయం తెలిసిందే.
విచారణకు సహకరించలేదని..
ఇప్పుడు దిలీప్ పై మరి కొన్ని కుట్రలు, హత్యారోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   తాజాగా, ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసుతోను సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు కళాభవన్ మణి సోదరుడు  రామకృష్ణన్‌ ఒక టీవీషోలో అనుమానం వ్యక్తం చేశారు. దిలీప్‌ పై నేరుగా ఆరోపణ చేయనప్పటికీ.. ఇద్దరికీ మధ్య భూతగాదాలు ఉన్నాయని, దీనిపై సీబీఐకి సమాచారం అందించానని, సీబీఐ ఆ కేసులో దర్యాప్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Image result for కళాభవన్
అలాగే మలయాళ దర్శకుడు బైజు కొట్టక్కర కూడా కళాభవన్‌ మణి మృతి వెనుక దిలీప్‌ హస్తంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐకి చెప్పారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: