టాలీవుడ్ లో ప్రకంపనాలను సృష్టిస్తున్న డ్రగ్ మాఫియా గురించి గంట గంటకి టాలీవుడ్ డైరక్టర్స్, హీరోలు, హీరోయిన్స్ ఇలా రరకాల పేర్లు వినబడుతున్నాయి. ఈ క్రమంలో అందరికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు డైరక్టర్ పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ పేరు బయటకు రావడంతో అందరికి షాక్ తగిలినట్టైంది.


తన సినిమాల్లో డ్రగ్ మాఫియా గురించి చెప్పే పూరినే ఇలా చేయడంతో అందరు షాక్ అవుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందుతులు కెల్విన్ తో వాట్సప్ చాటింగ్ లో పూరి పేరు ఉన్నదని అంటున్నారు. అయితే ఈ విషయాల పట్ల పూరి మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సీనియర్ పాత్రికేయులు పూరిని ఫోన్ లైన్ లో తీసుకోగా అసలైన లిస్ట్ తాను వెళ్లడిస్తానని.. ఎంతోగొప్ప చరిత్ర కలిగిన నట దిగ్గజాలు కూడా ఇందులో ఉన్నారని అన్నాడట.  


అంతేకాదు నిర్మాతల కొడుకులు ఈ డ్రగ్స్ వాడుతున్నారని పూరి చెప్పాడట. అయితే తనకు ఈ వివరాలన్ని చెప్పే దమ్ముంది కాని వాటిని రాసే దమ్ము మీకుందా అని మీడియాను చాలెంజ్ చేశాడట పూరి జగన్నాధ్. త్వరలోనే విచారణకు హాజరు కానున్న పూరి త్వరలో ఓ టివి ఇంటర్వ్యూకి వస్తానని చెప్పారట. 


నిజంగానే పూరి దగ్గర అంత పెద్ద లిస్ట్ ఉందా అని అందరు అవాక్కవుతున్నారు. నోటీసులు అందుకునేందుకు కూడా కొందరు నిరాకరించడం విశేషం. కొందరేమో నోటీసులు అందుకుని పోలీసులు చేసే ఎలాంటి టెస్టులకైనా సిద్ధమే అంటున్నారు.  మరి సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్ మాఫియా ఇంకా ఎన్ని ట్విస్టులు తిరిగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: