రాజమౌళి సృష్టించిన బాహుబలి హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ హీరోలను సైతం సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తిన బాహుబలి మొదటి రెండు పార్టులలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక సినిమాలో నటించిన ప్రభాస్, రానాలు ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో తెలిసిందే. అయితే ఈ సినిమా పార్ట్ 3 లో తాను హీరోగా చేస్తా అని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర.


రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డుల్లో సిద్ధార్త్ బాహుబలిపై తనకున్న ప్రేమను చూపాడు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్లు తీసి బోర్ కొట్టేసిందని బాహుబలి-3 లో ఛాన్స్ వస్తే నటిస్తా అని.. ఈవెంట్ హోస్ట్ గా చేస్తున్న కరణ్ జోహార్ ను తనని రాజమౌళి రికమెండ్ చేయాల్సిందిగా కోరాడు. అయితే దానికి వెంటనే కరణ్ జోహార్ కుదరదు అనేశాడు. ఎందుకు అని సిద్ధార్థ్ అడుగగా ఈ విషయం గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం అనేశాడు. 


బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అంతేకాదు తెలుగు సినిమా అంటే మూస్ థోరణిలో సాగే సినిమాలే అని ఉన్న టాక్ ను చెరిపేసి కొత్త సమీకరణాలను సృష్టించింది. అందుకే బాలీవుడ్ హీరోలకు బాహుబలి మీద అంత గురి ఏర్పడింది. కచ్చితంగా బాహుబలి-3 తీస్తే సిద్ధార్థ్ మాత్రమే కాదు అందులో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సై అనేస్తారన్నది వాస్తవం. 


ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే బాలీవుడ్ హీరోలు కూడా ఓ సౌత్ సినిమా అది కూడా తెలుగు సినిమా సీక్వల్ తీస్తే అందులో నటిస్తా అని చెప్పడం గొప్ప విషయమని చెప్పాలి. హిందిలో కరణ్ జోహార్ రిలీజ్ చేసిన బాహుబలి మొదటి రెండు పార్టులు ఆయనకు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: