ఈ మద్య సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి.  ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో దాసరి, సినారే, రవితేజ తమ్ముడు భరత్ మరణాలు కలచివేశాయి..మరోవైపు డ్రగ్స్ కలకలం చెలరేగుతూనే ఉన్నాయి.  మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోయిన్లు, టివి మోడల్స్, అప్ కమింగ్ నటీమణులు ఆత్మహత్య చేసుకోగా మరొకరు హత్యకు గురయ్యారు.  తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  
యువనటి బిదిశ అనుమానాస్పద మృతి
ఈ మద్య తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అస్సామీ నటిగా పాపులరయిన ఆమె ఢిల్లీలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధకనబర్చిన ఆమె.. టీనేజ్‌లో ఉండగానే రంగప్రవేశం చేసింది.

అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘జగ్గా జాసూస్‌’ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆమె ఇటీవలే ‘జగ్గా జాసూస్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.సినీ రంగంలో ఆమె అద్భుతంగా రాణిస్తోన్న స‌మ‌యంలో బిదిశా ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌బోద‌ని అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ఆమెకు గ‌త ఏడాది గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝాతో పెళ్లి జ‌రిగింది. నిశీత్‌ కుటుంబీకులు స‌ద‌రు న‌టిని వేధింపులకు గురిచేయడంతో ఆమె వేరుగా ఉంటోంది. భర్తతో మాత్రం ఆమె సత్సంబంధాలు కొన‌సాగిస్తోంది.   బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: